ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఐద్వా ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు.

By

Published : Jul 15, 2019, 2:05 PM IST

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. వెంటనే మంచినీరు సరఫరా చేయాలనీ.. కొళాయిలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. నీటి కొరతపై అధికారులు, పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి బైఠాయింపుతో ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు.

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

ABOUT THE AUTHOR

...view details