'పార్టీ నేతలతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమావేశం' - ఎస్.కోట
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏజెంట్ల నియామకం, కౌంటింగ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిపై పార్టీ నేతలతో ఎస్.కోట రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు.

'పార్టీ నేతలతో ఎస్.కోట ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమావేశం'
'పార్టీ నేతలతో ఎస్.కోట ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమావేశం'
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏజెంట్ నియామకం, కౌంటింగ్ హాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు, రక్షణ ఏర్పాట్లు తదితర విషయాలపై చర్చించారు. ఒక్కో అభ్యర్థి తరపున 17 మంది కౌంటింగ్ ఏజెంట్లు నియమించుకోవాలని... రెండు రోజుల్లో ఏజెంట్ల వివరాలు అందించాలని కోరారు.