కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా లారీ యజమానులు అధికంగా అద్దెలు వసూళ్లు చేయడం సరికాదని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ జీ.సీ. కిషోర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో లారీ యజమానులు, రవాణాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మానవతా ధృక్పథంతో ఆలోచించి అద్దెలను వసూలు చేయాలని ఆయన కోరారు. లారీ యజమానులకు పోలీసు సిబ్బంది సహకరిస్తారని తెలిపారు.
'లారీ యజమానులు అధికంగా అద్దెలు వసూలు చేయొద్దు' - విజయనగరం జిల్లాలో లాక్డౌన్
కరోనా నేపథ్యంలో లారీ అద్దెలు పెంచినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విజయనగరం జాయింట్ కలెక్టర్ లారీ యజమానులు, రవాణాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మానవతా థృక్పతంతో ఆలోచించి అద్దెలను వసూలు చేయాలని పేర్కొన్నారు.
విజయనగరం జాయింట్ కలెక్టర్ లారీ యజమానులు, రవాణాశాఖ అధికారులతో సమావేశం