ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 10, 2021, 7:47 PM IST

ETV Bharat / state

వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చేయాలి: కలెక్టర్ హరిజవహర్​లాల్

కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ నెల 11నుంచి 14వరకు రాష్ట్రవ్యాప్తంగా టీకా ఉత్సవం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో కరోనా టీకా ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు సమీక్షించారు.

review meeting in vizianagaram
విజయనగరంలో సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సంయుక్త క‌లెక్ట‌ర్లు కిశోర్ కుమార్‌, మ‌హేష్ కుమార్‌, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ర‌మ‌ణ కుమారి త‌దిత‌రుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. టీకా ఉత్స‌వంలో భాగంగా 45 సంవ‌త్స‌రాలు దాటిన వారందరికీ కొవిడ్ టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జ‌రిగే టీకా పంపిణీ క్యార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు సంయుక్త కలెక్టర్ మ‌హేష్ కుమార్‌కు కలెక్టర్ హరిజవహర్ లాల్ ప్ర‌త్యేక బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ‌, రెవెన్యూ, ఇత‌ర ప్ర‌భుత్వ శాఖల ఆధ్వ‌ర్యంలో టీకా పంపిణీ ప్రణాళికాబద్ధంగా జరగాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతం చేసేందుకు అన్ని విభాగాల అధికారులు కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

ఇవీచదవండి.

ఎరువుల కంపెనీల తీరుతో రైతులపై అదనపు భారం: నాగిరెడ్డి

కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య.. తన అవయవాలు భార్యకు ఇవ్వాలని లేఖ

కరోనా సోకి 'మహాభారతం' నటుడు మృతి

ABOUT THE AUTHOR

...view details