ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులే ముద్దంటూ.. వైకాపా బైక్​​ ర్యాలీ

మూడు రాజధానులకు మద్దతుగా విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి మండలాల్లో వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ చేపట్టారు. వైకాపా పార్టీ కార్యాలయం నుంచి చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

By

Published : Jan 23, 2020, 12:11 PM IST

vizainagaram ysrcp leaders bike rally
విజయనగరం జిల్లా చీపురుపల్లిలోవైకాపా నాయకులు ర్యాలీ

3 రాజధానులకు మద్దతుగా వైకాపా బైక్​ ర్యాలీ

మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులుండటం ఎంతో శ్రేయస్కరమని వైకాపా పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి మండలాల్లో వైకాపా నాయకులు బైక్​ ర్యాలీ చేపట్టారు. విశాఖను రాజధానిగా చేయడం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నుంచి చెన్నై, బెంగళూరుకు వలసలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details