ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం జగన్​ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు పెరిగాయి' - విజయనగరం తెదేపా ఎస్సీ నాయకులు తాజా వార్తలు

ఎస్సీలపై జరుగుతున్న దాడులను విజయనగరం పట్టణ తెదేపా నాయకులు ఖండించారు. తమపై దాడులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎస్సీలపై దాడులకు దిగిన వారిపై సీఎం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

vijayangaram tdp sc leaders protest against attacks on dalits
తెదేపా ఎస్సీ నాయకుల నిరసన

By

Published : Aug 30, 2020, 4:39 PM IST

విజయనగరం పట్టణ తెదేపా ఎస్సీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఎం జగన్​ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఎస్సీలపై దాడులు పెరిగాయన్నారు. ఎస్సీలపై దాడులు జరుగుతుంటే... చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. అలాగే ఎస్సీల భూములను లాక్కోవడం జరుగుతుందని, వారిపై కక్ష సాధింపు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమపై దాడులు ఆపకపోతే ఎస్సీ సంఘాలు కలిసికట్టుగా సీఎంకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details