ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 15, 2020, 2:48 PM IST

ETV Bharat / state

'అచ్చెన్నాయుడు బీసీలకు క్షమాపణలు చెప్పాలి'

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బీసీలందరికీ క్షమాపణలు చెప్పాలని వైకాపా బీసీ నాయకులు డిమాండ్​ చేశారు. విజయనగరంలోని గంటస్తంభం వద్ద వైకాపా బీసీ నాయకులు నిరసన చేపట్టారు. తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోందని వైకాపా నాయకులు అన్నారు. ఇలా చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

vijayanagaram ycp bc leaders protest over acchamnaidu issue
గంటస్తంభం వద్ద వైకాపా నేతలు నిరసన

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బీసీలకు క్షమాపణ చెప్పాలంటూ విజయనగరం పట్టణ వైకాపా నాయకులు ధర్నా చేశారు. గంట స్తంభం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో వైకాపా పట్టణ బీసీ విభాగం నేతలు పాల్గొన్నారు. ఈఎస్​ఐ అక్రమాలతో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంలో తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోందని వైకాపా నాయకులు అన్నారు. గతంలో తెదేపా బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. ఉన్న ఒక్క బీసీ మహిళను మంత్రి పదవి నుంచి తొలగించటం జిల్లా ప్రజలు మరిచిపోలేదన్నారు. ఏదైన సమస్య వచ్చినప్పుడు బీసీలను వాడుకోవటం తెదేపాకు పద్ధతి కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details