ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవటం దారుణం: ఊర్మిళ - Urmila Gajapatiraju fire on sanchaitha

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయితపై ఊర్మిళ గజపతిరాజు మండిపడ్డారు. ట్రస్ట్‌లో ఉద్యోగులకు ఎన్నో నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.

Urmila Gajapatiraju
ఊర్మిళ గజపతిరాజు

By

Published : Feb 9, 2021, 8:22 PM IST

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతి వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారిందని....ఈ వ్యవహరంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని ట్రస్టు పూర్వ ఛైర్మన్ ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ గజపతిరాజు కోరారు. ఈ మేరకు లేఖ ద్వారా సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జీతాల బకాయిలపై మాన్సాస్ ట్రస్టు పరిధిలోని మహారాజ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది ఆందోళనకు దిగటంపై ఊర్మిళ గజపతిరాజు విజయనగరంలోని తన బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు.

ట్రస్ట్​కు చెందిన కళాశాల ఉద్యోగులకు ఎన్నో నెలలుగా జీతాలు రాకపోవటం బాధాకరమని ఊర్మిళ అన్నారు. ఈ విషయంపై విద్యార్థులు సైతం నిరసన వ్యక్తం చేశారు. మా తాతగారు పీవీజీ రాజు విగ్రహం వద్ద నిరసన తెలపటం మరింత బాధ కలిగిస్తోందన్నారు. సంచయిత గజపతి ఛైర్ పర్సన్​గా వ్యవహరిస్తున్న సింహాచలం దేవస్థానం ఉద్యోగులకూ సకాలంలో జీతాలు అందటం లేదు. మాన్సాస్ ట్రస్టులో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఊహించలేదని ఊర్మిళ చెప్పుకొచ్చారు. ట్రస్ట్ ఛైర్​పర్సన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కారణంగా ఉద్యోగులు జీతాల కోసం ఆందోళనకు దిగాల్సి వచ్చిందని అన్నారు. ఉద్యోగులే కాకుండా.... ట్రస్టు పరిధిలోని విద్యాసంస్థల్లోని విద్యార్థులు నష్టపోయే చర్యలకు ఒడిగట్టడం విచారకరమన్నారు. ఈ నేపథ్యంలో మాన్సాస్ ట్రస్టు వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని లేఖ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఊర్మిళ గజపతి రాజు తెలియచేశారు.

ABOUT THE AUTHOR

...view details