ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 23, 2021, 8:06 PM IST

ETV Bharat / state

మాన్సస్ ట్రస్ట్ ఆశయాలు నాశనం చేసేందుకు ప్రయత్నాలు: ఊర్మిల గజపతి

మాన్సస్ ట్రస్ట్ ఆశయాలను నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని... ట్రస్ట్ మాజీ ఛైర్మన్ ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిల గజపతిరాజు ఆరోపించారు. ట్రస్ట్ ఇలాంటి దుస్థితికి రావటం బాధకలిగిస్తోందన్నారు.

మాన్సస్ ట్రస్ట్ ఆశయాలు నాశనం చేసేందుకు ప్రయత్నాలు
మాన్సస్ ట్రస్ట్ ఆశయాలు నాశనం చేసేందుకు ప్రయత్నాలు

విజయనగరం జిల్లాలో మహారాజ రెండో విజయరామ గజపతిరాజు మోమోరియల్ జూనియర్ కళాశాలను అర్ధాంతరంగా మూసేయటం పట్ల కళాశాలలో పనిచేసే అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని మాన్సస్ మాజీ ఛైర్మన్ ఆనంద గజపతిరాజు సతీమణి సుధా గజపతి, కుమార్తె ఊర్మిల గజపతిని కలిసి వినతిపత్రం అందజేశారు. 1994లో కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 25 ఏళ్లుగా కళాశాలలో భోదిస్తున్నామని.., ఉన్నట్లుండి ఇప్పుడు తొలగిస్తే కుటుంబాలతో సహా రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై స్పందించిన ఉర్మిల గజపతిరాజు.. తన తాత, తండ్రి ఆశయాలను నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాన్సస్ ట్రస్ట్ ఇలాంటి దుస్థితికి రావటం బాధేస్తోందన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాసి సమస్యకు పరిష్కారం కోరాతమని అధ్యాపకులకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details