ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యల పరిష్కారానికై గిరిజనుల 'చలో సాలూరు' కార్యక్రమం - చలో సాలూరు కార్యక్రమం న్యూస్

సమస్యల పరిష్కారం కోరుతూ...విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోని గిరిజనులు చలో సాలూరు కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ధర్నా చేపట్టి ఎమ్మెల్యే రాజన్నదొరకు వినతి పత్రం అందించారు.

చలో సాలూరు కార్యక్రమం
చలో సాలూరు కార్యక్రమం

By

Published : Dec 21, 2020, 4:50 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పరిధిలోని గిరిజనులు తమ సమస్యల పరిష్కారానికై చలో సాలూరు కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చిన గిరిజనులు పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే రాజన్నదొరకు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గిరిజన గ్రామాలన్నింటిని 5వ షెడ్యూల్ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. షెడ్యూల్ ధ్రువీకరణ పత్రాలిచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ, బంజరు భూములు సర్వే చేపట్టి పట్టాలివ్వాలన్నారు.

డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాజన్నదొర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details