ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త - విజయనగరం జిల్లా గుమడా వార్తలు

కడవరకు తోడునీడగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త ఆమె పాలిట యముడయ్యాడు. గొడ్డలితో భార్యను కర్కశంగా నరికి చంపాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడ గ్రామంలో జరిగింది.

The husband killed his wife  with an ax  at  gumada
కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

By

Published : Sep 25, 2020, 6:17 PM IST

విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమడాలో కుటుంబ కలహాలతో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన సిరిపురం ఊర్మిళ, కిషోర్ భార్య భర్తలు. కొన్నాళ్లుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్తతో ఇటీవల గొడవపడి ...ఊర్మిళ అదే గ్రామంలోని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. కిషోర్ భార్య ఉంటున్న ఇంటికి వెళ్లి గొడ్డలితో దారుణంగా నరికాడు.

స్థానికులు గమనించి కుటుంబీకులతో కలిసి బాధితురాలిని 108 వాహనంలో పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఊర్మిళ మృతి చెందిందని తెలిపారు. ఇంఛార్జ్ ఎస్ఐ జయంతి సంఘటనా ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఇదీ చూడండి.
పోలీసుల దాడులు.. అక్రమ మద్యం స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details