ఒడిశా నుంచి విశాఖపట్నం వెళుతున్న OR10H 2780 నెంబర్ గల కారు బీభత్సం సృష్టించింది. విజయనగరం జిల్లాలోని సాలూరు మండలం జీగిరం గ్రామం దగ్గర బైక్తో పాటు.. స్కూలు పిల్లలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. డ్రైవర్ కారు ఆపకుండా అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో వాలంటీర్ భాస్కరరావు కాలు విరిగింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అనిషా పరిస్థితి విషమంగా ఉంది. ఆ బాలికను విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
ఆటో, బైక్ను ఢీకొట్టి.. ఆపకుండా పరార్! - జీగిరం రోడ్డు ప్రమాదం
ఆటోతో పాటు బైక్ను ఢీకొట్టాడు. ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. కారు నెంబర్ ఆధారంగా అది ఒడిశా రిజిస్ట్రేషన్గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
![ఆటో, బైక్ను ఢీకొట్టి.. ఆపకుండా పరార్! జీగిరం రోడ్డు ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13717418-794-13717418-1637684146612.jpg)
జీగిరం రోడ్డు ప్రమాదం