విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ను త్రిదండి చినజీయర్ స్వామి సందర్శించారు. ట్రస్టు వ్యవస్థాపకుడు జగదీష్ మాతృమూర్తి అలివేలు మంగతాయారమ్మ జ్ఞాపకార్థం నెలకొల్పిన గోశాలను... అహోబిలం జీయర్స్వామితో కలసి ప్రారంభించారు. అనంతరం కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని సందర్శించి, తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసి, నిరుపేద వృద్ధులకు బియ్యం అందజేశారు.
శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ను సందర్శించిన చినజీయర్ స్వామి - vizianagaram distric news today
విజయనగరం జిల్లాలోని శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ను త్రిదండి చినజీయర్ స్వామి సందర్శించారు. ట్రస్ట్ నిర్వాహకులు జగదీష్ చేస్తున్న సేవలను కొనియాడారు. తన వంతు సహాయంగా రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

శ్రీగురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ను సందర్శించిన శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి
ట్రస్టు నిర్వహకులు జగదీష్ చేస్తున్న సేవలు ప్రశంసించదగినవని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. ట్రస్ట్ సేవలకు... పరిశ్రమలు, సంస్థలు ముందుకొచ్చి సహాయ అందించటం అభినందనీయమన్నారు. ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయంగా రూ.10లక్షల సాయం ప్రకటించారు.
ఇదీచదవండి.