ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 29, 2020, 1:44 PM IST

ETV Bharat / state

'పక్క జిల్లాలో కరోనా ఉంది.. అప్రమత్తంగా ఉందాం'

చీపురుపల్లి నియోజకవర్గంలో ఎస్పీ రాజకుమారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నియోజకవర్గంలోని గుర్ల, గరివిడి, గర్భం, భుదరబలస చెక్​పోస్టుల వద్దకు వెళ్లి లాక్​డౌన్​ అమలు తీరును పరిశీలించారు. ప్రస్తుతం పక్క జిల్లాల్లో కరోనా వ్యాధి గ్రస్తులు ఉండడం వల్ల భద్రత మరింత కట్టదిట్టం చేశామన్నారు.

sp rajakumari visit chipurupalli counstacy
చీపురుపల్లిలో ఎస్పీ రాజకుమారి ఆకస్మి తనిఖీలు

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎస్పీ రాజకుమారి ఆకస్మికంగా పర్యటించారు. నియోజకవర్గంలోని గుర్ల, గరివిడి, గర్భం, భుదరబలస చెక్​పోస్టుల వద్దకు వెళ్లి లాక్​డౌన్​ అమలు తీరును పరిశీలించారు.

విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా కేసులు నమోదైన కారణంగా... జిల్లాలో మరిన్ని భద్రత చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. బయటవాళ్లు జిల్లాలోకి రాగానే కరోనా పరీక్షలు నిర్వహించి, అనుమానితులను హోం క్వారంటైన్​కు తరలిస్తున్నమని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details