లాక్డౌన్ కారణంగా 65 రోజులుగా ఉపాధి లేక రోడ్డున పడ్డామని తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు, బిర్యానీ, చాట్, నూడిల్స్ అమ్ముకునే నిరుపేదలు రోడ్డున పడ్డారని సీపీఎం నాయకులు రెడ్డి శంకర్రావు అన్నారు. విజయనగరంలో కార్మికులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో పదివేల రూపాయలు వేయాలని డిమాండ్ చేశారు. పరిమిత సమయంలో వీరు వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
వామపక్షాల ఆధ్వర్యంలో చిరువ్యాపారుల నిరసన - lockdown effect on pani puri owners in viziangaram dst
లాక్ డౌన్ కారణంగా పనులు లేక తాము రోడ్డున పడ్డామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని తోపుడు బండ్ల కార్మికులు సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో విజయనగరంలో నిరసనకు దిగారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని నినాదాలు చేశారు.
small business mens conduct dharna under CPI,CPM about their problems due to lockdown in vizainagaram dst