ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎస్.కోటలో రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి గాయాలు

By

Published : Apr 10, 2021, 10:39 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని జడ్​కుమరాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ బోల్తా పడి ఏడుగురు కూలీలు గాయపడ్డారు.

oad accident at shringavarapu kota
ఎస్.కోటలో రోడ్డు ప్రమాదం

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని జడ్​కుమరాం కేకే రైల్వే​ రెండో లైన్ పనుల్లో భాగంగా... ఇనుప ఊచలు తీసుకెళ్తున్న వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్​లో ఉన్న ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details