ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 12, 2021, 3:04 AM IST

ETV Bharat / state

ఘనంగా శంబర పోలమాంబ జాతర

విజయనగరం జిల్లా శంబర గ్రామంలో శంబర పోలమాంబ జాతర జరిగింది. మేళతాళాలు, గిరిజన వాయిద్యాలు, వేలాది మంది భక్తుల మధ్య గ్రామంలోని చదురు గుడిలో అమ్మవారు కొలువుదీరారు.

Sambara Polamamba Jatara
శంబర పోలమాంబ జాతర.. కొలువుదీరిన అమ్మవారు

విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో శంబర పోలమాంబ జాతరను ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా గ్రామ పొలిమేరల నుంచి అమ్మవారి ఘటాలను పూజారి, జన్ని, గిరడ, నాయుడు, కరణం కుటుంబ సభ్యులు చేతులపై మోసుకొచ్చారు. మేళతాళాలు, గిరిజన వాయిద్యాలు, వేలాది మంది భక్తుల మధ్య అమ్మవారు గ్రామంలోని చదురు గుడికి తరలివచ్చారు. ఈ క్రార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అమ్మవారి దీవెనలు పొందారు.

ABOUT THE AUTHOR

...view details