ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 31, 2021, 5:19 PM IST

ETV Bharat / state

'సీటు కావాలంటే.. మా పార్టీలో చేరండి'

సాలూరు పట్టణంలో నేడు పురపాలక సంఘం సమావేశం జరిగింది. ప్రతిపక్ష పార్టీ ఫ్లోర్ లీడర్​కు సీటు కేటాయించకపోవడంతో.. అధ్యక్షురాలిపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'సీటు కావాలంటే.. మా పార్టీలో చేరండి'
'సీటు కావాలంటే.. మా పార్టీలో చేరండి'

విజయనగరం జిల్లాలో నేడు సాలూరు పట్టణ పురపాలక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి పక్ష పార్టీ ఫ్లోర్ లీడర్​కు సీటు కేటాయించకపోవడంపై.. తెదేపా నేతలు అధ్యక్షురాలి తీరును తప్పుబట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయమై స్పదించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఈశ్వరమ్మ.. తెదేపా కౌన్సిల్ సభ్యులు తమ పార్టీలో చేరాలని.. అప్పుడు వారికి సీట్లు ఇస్తామని చెప్పారు. ఛైర్ పర్సన్ స్పందనపై మరింత ఆగ్రహించిన తెదేపా సభ్యులు వాకౌట్ చేసి వెళ్లి పోయారు.

ABOUT THE AUTHOR

...view details