ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన గ్రామాల్లో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ

లాక్ డౌన్ కారణంగా నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. విజయనగరం జిల్లాలో గిరిజన గ్రామాల్లోని ప్రజలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు అందించింది.

By

Published : Apr 25, 2020, 5:04 PM IST

rice and daily needs distribute to vizianagaram agency villages
గిరిజన గ్రామాల్లో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ

విజయనగరం జిల్లా కురుపాం మండలం గుమ్మ గ్రామంలో 250 మంది నిరుపేదలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. స్థానిక గ్రామ సచివాలయంలో గుమ్మ గ్రామం చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లోని వారికి బియ్యం, కూరగాయలు అందజేశారు. అనంతరం గ్రామంలో ఉన్న 32 మహిళా సంఘాలకు వైయస్సార్ సున్నా వడ్డీ పథకం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి మూటక రాజేశ్వరి, నాయకులు దమయంతి తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details