ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 19, 2021, 3:23 PM IST

Updated : Mar 19, 2021, 5:57 PM IST

ETV Bharat / state

రామతీర్థం హుండీ ఘటన: ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

Ramatirtham temple issue
రామతీర్థం హుండీ లెక్కింపులో చేతివాటం ఘటనపై చర్యలు

15:21 March 19

రామతీర్థం ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం ఘటన

విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. విశాఖ డీసీ సుజాత, విజయనగరం సహాయ కమిషనర్ రంగారావులపై సస్పెన్షన్ వేటు చేశారు. ఈ నెల 17న హుండీ లెక్కింపు సందర్భంగా సుజాత వాహన డ్రైవర్ చేతివాటం ప్రదర్శించి..బంగారు శతమానం, రూ.3 వేలు దొంగిలించాడు. నగదు లెక్కింపు చోటుకు డ్రైవర్‌ను రానిచ్చిన డీసీపై దేవదాయశాఖ వేటు వేసింది. పర్యవేక్షణ లోపం వల్ల విజయనగరం సహాయ కమిషనర్‌ రంగారావు సస్పెన్షన్​కు గురయ్యారు.

ఇదీ చదవండి:

 'చిన్నారుల హత్యకు భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలే కారణం'

Last Updated : Mar 19, 2021, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details