ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీపురుపల్లిలో ప్రారంభం కానున్న 93 రైతుభరోసా కేంద్రాలు - raithu bharosa centres in vijayanagaram

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో 93 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అమరావతి నుంచి ప్రారంభించనున్నారు.

raithu bhrosa centres in chipuurupalli
రేపు చీపురుపల్లిలో ప్రారంభం కానున్న 93 రైతు భరోసా కేంద్రాలు

By

Published : May 29, 2020, 6:43 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో 93 రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అమరావతి నుంచి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించనున్నారు. గరివిడి, గుర్ల, మెరకముడిదాం, చీపురుపల్లి మండలాల్లో 93 కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.

రైతుభరోసా కేంద్రాలు రెండు రకాలు. ఒకటి రైతులకు వనరులు అందజేసిన కేంద్రం. రెండోది రైతులకు విజ్ఞానం వివరించే కేంద్రం. ఎప్పుడు ఏ పంటలు వేయాలి... అధిక ఉత్పత్తులు ఎలా రాబట్టాలి... గిట్టుబాటు ధర ఎలా తెచ్చుకోవాలి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి ఎలా సాధించాలి అనే విషయాలను వివరిస్తారు.

రైతుకు వనరులు అందించి... సకాలంలో సరసమైన నాణ్యమైన ఎరువులు విత్తనాలు పురుగుమందులు, రైతులకు ఉపయోగపడే అన్నింటిని సకాలంలో సరసమైన ధరలకు ఇందులో అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు..ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details