మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం - నాణ్యత లేని ఆహారం తిని ఆరుగురు విద్యార్థులు అస్వస్థత న్యూస్
మద్యాహ్న భోజన పథకంలో భాగంగా.. ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలోని ఓ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నాణ్యత లేని ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ సమస్యను కురుపాం పస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.
![మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం Quality defect in school lunch scheme in Vizianagaram district Kurupam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10693369-979-10693369-1613736096639.jpg)
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం
విజయనగరం జిల్లా కురుపాంలోని పలు పాఠశాలల్లో మద్యాహ్న భోజన పథకం అధ్వానంగా మారింది. ఇటీవల ఓ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నాణ్యత లేని ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో భోజనం చేసేందుకు విద్యార్థులు నిరాకరించారు. ఈ సమస్యను పర్యవేక్షించాల్సిన అధికారులే చోద్యం చూస్తుండడంతో విద్యార్థులకు శాపంగా మారింది. విషయాన్ని కురుపాం పస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.