విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గుణి దాం గ్రామానికి చెందిన తమ్మిన కృష్ణారావు అనే రైతు తనకున్న రెండు ఎకరాల్లో గుమ్మడి పంటను పండిస్తున్నారు. తనకున్న రెండు ఎకరాల్లో ముందుగా బొప్పాయి పంట వేసుకున్నారు. వేసుకున్న బొప్పాయి పంటకు వైరస్ ఆశించి పెట్టుబడి మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని ఆలోచించి.. బొప్పాయిలో అంతర పంటగా గుమ్మడి సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నట్లు కృష్ణారావు చెప్పుకొచ్చారు. ఈటీవీలో ప్రసారమయ్యే జైకిసాన్లో చూసి అంతర పంటగా గుమ్మడి సాగు చేసినట్లు ఆయన వెల్లడించారు.
గుణి దాం గ్రామంలో తమ్మినేని కృష్ణారావు అనే రైతు తనకున్న రెండెకరాల బొప్పాయి తోటలో అంతర పంటగా గుమ్మడి సాగు ప్రారంభించారు. సాగుకు సంబంధించి తనకున్న పరిజ్ఞానంతో సాటి రైతుల సలహాలు సూచనలు తీసుకుని ఒడిశా నుంచి సుమారు రెండు ఎకరాలకు సరిపడా బరంపురం పరదేశి విత్తనాలను ఒక కిలో రూ. 3000 రూపాయలు ఇచ్చి తెప్పించుకున్నారు. విత్తనాలు నాటుతున్న సమయంలో మన గ్రోమోర్ షాప్ నుంచి మెగా పవర్, సల్ఫర్లను కలిపి విత్తనాలు పొడిచే గుంతలో కొద్దికొద్దిగా అంచనా వేసుకొని విత్తనాలు నాటారు. ప్రతి పది రోజుల నుంచి 15 రోజుల మధ్యలో డ్రిప్ సహాయంతో నీరు పెట్టుకుని పంటను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశారు. తర్వాత 25 రోజుల తర్వాత మరొక్కసారి మెగా పవర్, సల్ఫర్ రెండు ఎకరాలకు అందిచారు. దీంతో పంట ఏపుగా పెరిగిందని ఆయన అన్నారు. పంట విత్తిన రెండు నెలలకే రెండు సార్లు పంటను కోసి అమ్మడం జరిగిందని రైతు చెప్పారు. ఇప్పటివరకు ఎటువంటి మందులు పిచికారి గాని జరగలేదని రైతు కృష్ణారావు తెలుపుతున్నారు.