ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడి పరిశ్రమ కార్మికులను ఆదుకోవాలని నిరసన - Protest to support workers at vizianagaram news

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అర్ధాంతరంగా కోడి పిల్లల పరిశ్రమలను మూసివేయటంతో కార్మికులు ఆందోళనకు దిగారు.

Protest to support workers
రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకోవాలని నిరసన

By

Published : Sep 22, 2020, 9:32 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో శ్రీనివాస్ కోడి పిల్లల పరిశ్రమలో ఒక యూనిట్ మూసివేయటంతో కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు రావలసిన బకాయిలు తక్షణమే చెల్లించాలని నినదించారు. పరిశ్రమలో ఒక యూనిట్​లో ఉన్న 22 మందిని విధులకు రావద్దని చెప్పటం దారుణమని సీఐటీయూ ఉపాధ్యక్షులు సూర్యనారాయణ విమర్శించారు. వారికి ఇవ్వాల్సిన పీఎఫ్, బకాయిలను చెల్లించాలని.. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి ప్రకటన లేకుండా సిబ్బందిని తొలగించటం అన్యాయమని.. దీనిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు నర్సింగ్​రావు, సుందరరావు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రఘురామకృష్ణరాజుపై స్పీకర్​కు ఫిర్యాదు చేస్తా: నందిగం సురేశ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details