ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 23, 2020, 9:22 PM IST

ETV Bharat / state

ఫీడర్ అంబులెన్స్​లో ప్రసవం... తల్లీబిడ్డా క్షేమం

ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. అత్యవసరం కావడం వల్ల ఆమెను ఫీడర్ ఆంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్ వైద్య నిపుణుడు గర్భిణికి చికిత్స చేశారు. తల్లీబిడ్డ ప్రాణాలను కాపాడారు.

pregnant-women-give-birth-in-bike-ambulance
ఫీడర్ అంబులెన్స్​లో ప్రసవం

విజయనగరం జిల్లాలో ఓ మహిళ ఫీడర్ ఆంబులెన్స్​లో ప్రసవించింది. సాలూరు మండలం బూర్జ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఫీడర్ ఆంబులెన్స్​లో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. బైక్ అంబులెన్స్ వైద్య నిపుణుడు గర్భిణికి చికిత్స చేయగా..ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శంబర ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details