ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 5, 2020, 7:55 PM IST

ETV Bharat / state

భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పై ప్రణాళికలు

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పై పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ డీఈ గోవిందరావు తెలిపారు.

vizianagaram
భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పై ప్రణాళికలు

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను ఇరిగేషన్ శాఖ డీఈ గోవిందరావు పరిశీలించారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థపై స్థానిక నాయకులతో సమీక్షించారు. ఇప్పటికే ఉన్న గృహాలు, దుకాణ సముదాయాలకు ఇబ్బందులు లేకుండా మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ అధ్యక్షులు సుందర గోవిందరావు , మాజీ ఉప సర్పంచ్ శుబోషణరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details