ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి !

By

Published : Jun 26, 2020, 9:14 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కోరికలవలస గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో పైడితల్లి అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి !
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి !

విద్యుధాఘాతంతో ఒకరు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కోరికలవలస గ్రామంలో జరిగింది. సాలూరు మండలం దత్తివలస గ్రామానికి చెందిన 9 మంది యువకులు బృందంగా ఏర్పడి.. విద్యుత్ కాంట్రాక్ట్​ పనులు చేస్తున్నారు. కోరికలవలస గ్రామంలో కరెంట్​ స్తంభాలకు వైర్లు లాగుతుండగా.. నలుగురు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై.. సొమ్మసిల్లి పడిపోయారు. వారిలో పైడితల్లి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

మిగిలిన ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. యువకుని మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ABOUT THE AUTHOR

...view details