ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 1, 2021, 7:55 PM IST

ETV Bharat / state

మృతదేహానికి పింఛన్...సామాజిక మాధ్యమాల్లో వైరల్

విజయనగరం జిల్లాలోని ఓ వాలంటీర్ నిర్వాకం చర్చనీయాంశమైంది. చనిపోయిన మహిళకు పింఛన్ అందజేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేనా ఏకంగా మృతురాలి నుంచి వేలిముద్ర సైతం తీసుకొని ఓ ఫొటో కూడా దిగాడు. ఈ వార్త కాస్త వైరల్ కావటంతో అధికారులు విచారణకు ఆదేశించారు.

pension to dead body in vizianagaram district
మృతదేహానికి ఫించన్...సామాజిక మాద్యమాల్లో వైరల్

విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన వాలంటీర్ త్రినాద్.. ఒకటో తేదీ కావటంతో తన వార్డు పరిధిలో పింఛన్ల పంపిణీ చేపట్టాడు. ఈ క్రమంలో... చనిపోయిన ఎర్ర నారాయణమ్మ అనే మహిళకు పింఛన్ అందజేశాడు. మృతురాలి నుంచి వేలిముద్ర సైతం తీసుకున్నాడు. అంతేనా ఏకంగా పింఛన్ అందజేస్తున్నట్లు ఫొటో సైతం తీయించుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అధికారుల మెప్పు కోసమే వాలంటీర్ ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆశ్యర్యపోయిన అధికారులు... విచారణకు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details