ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 17, 2020, 7:32 PM IST

ETV Bharat / state

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలో జరిగింది.

one person died
రెండు ద్విచక్రవాహనాలు ఢీ

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలోని సుంకి మలుపు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పార్వతీపురం బంగారమ్మ కాలనీలో నివాసిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు లక్ష్మణరావు, దండాసితో కలిసి బైక్​పై కురుపాం వైపు వెళ్తున్నారు.

సుంకి మలుపు వద్ద వారిని మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన జానకి, వెంకటరమణ దంపతులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందారు. పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి: ఊరు ఊరే కూరగాయల తోటగా మారితే..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details