ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాపాడటానికి వెళ్లాడు... ప్రాణాలు పోగొట్టుకున్నాడు

తోటి వ్యక్తి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు చివరికి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు.

By

Published : Sep 23, 2019, 5:57 PM IST

చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా ఎస్ ​కోట మండలం పోతనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రసాద్​ అనే వ్యక్తి పశువులను కాయటానికి స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. సమీపంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రసాద్​ ను రక్షించి బయటకి తీసుకువచ్చారు. ఈ ప్రయత్నంలో సత్తిబాబు అనే వ్యక్తి చెరువులో మునిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్తిబాబును ఎస్​ కోట ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details