ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపాలో చేరిన వంద కుటుంబాలు.. కండువా కప్పిన అశోక్​గజపతి రాజు

By

Published : May 12, 2022, 9:31 AM IST

100 families joined TDP: విజయనగరంలో వంద కుటుంబాలు తెదేపాలో చేరాయి. పూసపాటి అశోక్ గజపతి రాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొన్నారు.

100 families joined TDP:
తెదేపా చేరిన వంద కుటుంబాలు

100 families joined TDP: విజయనగరంలో ఇప్పిలి వీధికి చెందిన వంద కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. పూసపాటి అశోక్ గజపతి రాజు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. వైకాపా విధ్వంసం పాలన చూసే ప్రజలు తెలుగుదేశంలో చేరుతున్నారని.. ఇది ఎంతో ఆనందదాయకమని అశోక్‌ గజపతి రాజు అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రజా సంక్షేమాన్ని మరిచారని మండిపడ్డారు. గాలి పీలుస్తున్న ముక్కులకు కూడా మీటర్స్ బిగించే రోజులొస్తాయని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో అంతా ఒక్కటిగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details