ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుదాఘాతంతో వ్యక్తి, ఎద్దు మృతి

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలయ్యాయి. తెగిన విద్యుత్ తీగ తగలి ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లా తోటపల్లిలో జరిగింది.

By

Published : Dec 16, 2020, 2:17 PM IST

Published : Dec 16, 2020, 2:17 PM IST

one died with current shock
కరెంట్ షాక్

విజయనగరం జిల్లా భోగాపురం మండలం రామచంద్రపేట పంచాయతీ గ్రామమైన తోటపల్లిలో విద్యుత్ తీగ తెగి.. ఓ వ్యక్తి మరణించాడు. గ్రామానికి చెందిన పంచదార్ల తాత తెల్లవారుజామున 3 గంటలకు రామచంద్రపేటకు సమీపంలో ఉన్న ఏటి నుంచి ఇసుక తీసుకువచ్చేందుకు వెళ్లాడు. పంచదార్ల తాతతో పాటు గ్రామానికి చెందిన అప్పన్న, ఇసుక ఎడ్ల బండిలో లోడ్ చేసుకొని తిరుగుపయనమయ్యారు. గ్రామానికి సమీపంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగ ఎద్దు కొమ్ముకు తగలటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో బండి ముందుకు వంగటంతో పంచదార్ల తాత చేతికి విద్యుత్ తీగ తగిలి, అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక వస్తున్న అప్పన్న ఈ విషయాన్ని గమనించి, గ్రామస్థులకు సమాచారం అందించారు. మృతుడు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details