ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆరేళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం

By

Published : May 7, 2020, 9:10 PM IST

చాక్లెట్ ఆశచూపి ఆరేళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పిడిన అమానుష ఘటన విజయనగరం జిల్లా రంగరాయపురంలో చోటుచేసుకుంది. వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వృద్ధుడు చాక్లెట్ ఆశచూపి తన మనవరాలి వయస్సున్న ఓ చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన అమానవీయ ఘటన విజయనగరం జిల్లా రంగరాయపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ఢుడు సత్యం... ఆరుబయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికకు చాక్లెట్ కొనిస్తానని తన పూరి గుడిసెలోకి తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా..గమనించిన ఓ బాలుడు విషయాన్ని బాలిక తల్లికి తెలిపాడు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్ధుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details