ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళా కొవిడ్​ వారియర్​ అవార్డు అందుకున్న విజయనగరం ఎస్పీ

By

Published : Jan 31, 2021, 8:55 PM IST

కొవిడ్ ఉమెన్ వారియర్ అవార్డు​ను విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి అందుకున్నారు. తన పేరు సిఫార్సు చేసిన డీజీపీకి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.

vizianagaram sp awarded with covid women warror award in delhi
మహిళా కొవిడ్​ వారియర్​ అవార్డు అందుకున్న విజయనగరం ఎస్పీ


కొవిడ్ ఉమెన్ వారియర్​గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుశాఖ నుంచి నామినేట్ అయిన.. విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారిని జాతీయ మహిళా కమిషన్ నేడు దిల్లీలో ఘనంగా సత్కరించింది. కేంద్ర అటవీ మరియు సైన్స్ ఆండ్ టెక్నాలజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్​ అవార్టు ప్రదానం చేశారు. కొవిడ్ వారియర్​గా తన పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్​కు విజయనగరం జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా విపత్కర సమయంలో విజయనగరం జిల్లా ఎస్పీ నిత్యం క్షేత్రస్థాయిలో ఉండి.. ప్రజలకు అండగా నిలిచారు. కొవిడ్ పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిలో మనో ధైర్యాన్ని నింపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వలస కార్మికులకు రేయింబవళ్లు సేవలందించారు. విపత్కర సమయాల్లో పోలీసు సిబ్బంది అందరికీ ఆమె స్ఫూర్తిగా నిలిచినందుకు నేడు అవార్డు అందుకున్నారు.

ఇదే విధంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అంగన్​వాడీ టీచర్ చంద్రకళకు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ అవార్డును అందించారు. కొవిడ్ సమయంలో చిన్నారులకు పోషకాహారం అందించడంలో చేసిన కృషికి చంద్రకళకు పురస్కారం లభించింది.

ఇదీ చదవండి:

ఇంతకీ ఎన్నికల కోడ్ అంటే ఏంటి? మెుదట ఎక్కడ అమలైంది?

ABOUT THE AUTHOR

...view details