Suicide attempt: ఇద్దరు పిల్లలు సహా ఓ తల్లి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన విజయనగరం జిల్లాలోని జమ్మునారాయణపురంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా జమ్ము నారాయణపురంలోని.. సాయి కుటీర్ అపార్ట్ మెంట్లో దుర్గ కుటుంబం నివాసం ఉంటోంది.
ఈరోజు ఉదయం వాళ్ల ఇంటి నుంచి.. అరుపులు వినిపించడం, పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పరిగెత్తుకెళ్లి చూడగా.. 28 ఏళ్ల దుర్గతోపాటు ఆమె ఇద్దరు పిల్లలు ఏడేళ్ల గౌతమ్, ఐదేళ్ల మానస మంటల్లో కాలిపోతున్నారు.