ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 4, 2020, 4:54 PM IST

ETV Bharat / state

విజయనగరంలో మొబైల్ రైతు బజార్

విజయనగరంలో మొబైల్ రైతు బజార్​ను స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం రేషన్​ కార్డులు లేని కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు.

mla kolagatla veerabhadra swamy
మొబైల్ రైతు బజార్​ను ప్రారంభించిన శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి

మొబైల్ రైతు బజార్​ను ప్రారంభించిన శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి

రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్​ను విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి పంపిణీ చేశారు. అనంతరం మొబైల్​ రైతు బజార్​ను ప్రారంభించిన ఆయన లాక్​డౌన్​ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయాన్ని స్థానిక నాయకులు గురుమూర్తి, రవిచంద్రలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. రేషన్ కార్డు లేని నిరుపేదల కుటుంబాలకు 10 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ ఎస్.ఎస్ వర్మ, సహాయ కమిషనర్ ప్రసాదరావు, స్థానిక వైకాపా నాయకులు గురుమూర్తి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details