ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భరోసా కేంద్రాలతో రైతు ముంగిట్లోకే అన్ని సేవలు అందిస్తున్నాం' - mla baddukonda appalanaidu latest comments

భవిష్యత్తులో వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు సంబంధించిన రైతులతో ఆయన సమీక్షించారు.

mla baddukonda appalanaidu
రైతులతో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సమీక్ష

By

Published : Jun 16, 2020, 12:35 PM IST

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు.. వారి ముంగిటకే అందుతున్నాయని నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే, కమిటీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. నియోజకవర్గంలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు సంబంధించిన రైతులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

విత్తనాలు, ఎరువులతో పాటు వివిధ సాంకేతిక పరికరాలు సైతం అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు సుందర గోవిందరావు, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details