ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొత్స సత్యనారాయణకు మంత్రుల పరామర్శ - AP minister Botsa Satyanarayana

మంత్రి బొత్స సత్యనారాయణను ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మంత్రులు పేర్నినాని, కొడాలి నాని పరామర్శించారు. ఇటీవల దివంగతురాలైన ఆయన మాతృమూర్తి చిత్రపటానికి అంజలి ఘటించారు.

Botsa Satyanarayana's mother passes away in Vizag
Botsa Satyanarayana's mother passes away in Vizag

By

Published : Aug 17, 2020, 3:56 PM IST

మాతృ వియోగం కలిగిన మంత్రి బొత్స సత్యనారాయణను... సహచర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని పరామర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరం వచ్చిన మంత్రులు... బొత్స నివాసానికి వెళ్లి ఆయన మాతృమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు.

మంత్రులతో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పలువురు ప్రజాప్రతినిధులు అంజలి ఘటించారు. మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(87) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details