ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 13, 2020, 1:38 PM IST

ETV Bharat / state

ఊరేమో దూరం... అయినా ఆగదు ఈ పయనం!

లాక్ డౌన్ కారణంగా వలస కూలీల బాధలు వర్ణాణాతీతం. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో సొంతగూటికి చేరేందుకు వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భానుడు భగభగమంటున్నా.. చంటిబిడ్డలతో.. భుజాన బ్యాగులతో గమ్యానికి చెరేందుకు ఆరాట పడుతున్నారు.

migratw workers facing  problems when coming to their own palces
migratw workers facing problems when coming to their own palces

చెన్నై వైపు నుంచి గుంటూరుకు వలస కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జాతీయ రహదారిపై వస్తున్న వారికి స్వచ్ఛంద సంస్థలు దాహార్తి తీరుస్తున్నాయి. మరికొందరు ఆహారం అందిస్తున్నారు.

తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య పట్టుదలతో గమ్యస్థానాలకు చేరేందుకు వారు పడుతున్న అగచాట్లు దయనీయంగా ఉన్నాయి. ఎలాగైనా ఇంటికి చేరాల్సిందే అన్న పట్టుదలతో వారు కష్టంగా అయినా అడుగు ముందుకేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details