విజయనగరంలోని మొత్తం 60వార్డుల్లో... 24వార్డులకు తాటిపూడి జలాశయం ద్వారా తాగునీరు వస్తోంది. ఆ జలాలతోనే సుమారు 2లక్షల జనాభాకు తాగునీరు లభిస్తోంది. తాటిపూడిలో నీటిమట్టం కనిష్ఠస్థాయికి పడిపోయిన ప్రతిసారి... నగరంలో నీటి సమస్య తీవ్రతరమవుతోంది. ప్రధానంగా కంటోన్మెంట్, తోటపాలెం, కె.ఎల్.పురం, బాలాజీ నగర్, కొత్త అగ్రహారం తదితర ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరుతాయి.
ఈ నేపథ్యంలో భవిష్యత్తు మంచినీటి అవసరాల దృష్ట్యా... నగరపాలక సంస్థ భూగర్భజలాల వృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు ఇంకుడు గుంతల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై సర్వే నిర్వహించి... 730 స్థలాలను గుర్తించారు. గుర్తించిన ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టారు. తొలివిడత చేపడుతున్న 730ఇంకుడు గుంతలన్నింటినీ నగరపాలక సంస్థ నిధులతోనే నిర్మిస్తున్నట్లు అధికారులు తెలియచేశారు.
ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి..