ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సంచైత నియామకం రద్దుపై అప్పీళ్లు

By

Published : Jul 14, 2021, 4:49 AM IST

Updated : Jul 14, 2021, 5:27 AM IST

మాన్సస్ ట్రస్టుకు ఛైర్మన్​గా సంచైత గజపతిరాజు నియామకాన్ని రద్దు చేస్తూ.... హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ఎదుట అప్పీళ్లు దాఖలయ్యాయి . రాష్ట్ర ప్రభుత్వం 3 అప్పీళ్లు వేయగా .. సంచైత మరో 3 అప్పీళ్లు వేశారు . ప్రభుత్వం వేసిన 2 అప్పీళ్లు మాత్రమే కేసుల జాబితాలో విచారణకు రాగా... మిగిలిన అప్పీళ్లతో కలిపి విచారించాలని వారి తరపు న్యాయవాదులు కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం కేసును 2 వారాలకు వాయిదా వేసింది .

mansas trust petitions in highcourt
mansas trust petitions in highcourt

మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యురాలిగా, ట్రస్ట్ ఛైర్మన్ గా , సింహాచలం దేవస్థానం ఛైర్మన్ గా సంచైత గజపతిరాజు నియామకాన్ని రద్దు చేస్తూ.... హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ఎదుట అప్పీళ్లు దాఖలయ్యాయి . రాష్ట్ర ప్రభుత్వం, సంచైత చెరో 3 అప్పీళ్లు వేశారు . ప్రభుత్వం వేసిన 2 అప్పీళ్లు మాత్రమే కేసుల జాబితాలో విచారణకు రాగా... మిగిలిన వాటిని కలిపి విచారించాలని వారి తరపు న్యాయవాదులు కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం కేసును 2 వారాలకు వాయిదా వేసింది .

సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి , దేవదాయ కమిషనర్ అప్పీల్ వేశారు .1958 నవంబర్ 12 న రాసుకున్న ట్రస్ట్ దస్తావేజు ప్రకారం ' కుటుంబంలో పెద్దవాళ్లయిన పురుషులు ' వంశపారంపర్య ఛైర్మన్ అధ్యక్షులుగా వ్యవహరించాలని ఉందని , అందుకు విరుద్ధంగా సంచైత గజపతిరాజు తదితరులను ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ప్రభుత్వం నియమించిందని అశోక్ గజపతి రాజు హైకోర్టులో వ్యాజ్యం వేశారని పిటిషన్​లో పేర్కొన్నారు . ఏపీ దేవాదాచ చట్టంసెక్షన్ 17 ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులను గుర్తించే వ్యవహారాన్ని వివరిస్తోందన్నారు . దాని ప్రకారం ' వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ' పరిధిలోకి పిల్లలు , మనవళ్లు వస్తారు . సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు .. ట్రస్ట్ డీడ్ కు అనుగుణంగా ఉందన్నారు. దేవాదాయ చట్టంలోని సెక్షన్17 , 160 స్ఫూర్తికి విరుద్ధంగా తీర్పు ఉందని . అధికరణ 15ను ఉల్లంఘించేదిగా ఉందని పిటిషన్​లో తెలిపారు. ప్రాథమిక హక్కులకు లోబడి సంప్రదాయాలు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు . లింగం ఆధారంగా ఏ వ్యక్తిని వివక్షకు గురిచేయడానికి వీల్లేదని సుప్రీం చెప్పిందన్నారు. ప్రస్తుత కేసులో ట్రస్ట్ డీడ్ , లింగం ఆధారం చేసుకొని వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా గుర్తింపు పొందేందుకు సంచైత తదితరులు అనర్హులని అశోక్ గజపతిరాజు ' చెబుతున్నారని తెలిపారు . పురుష , స్త్రీ సభ్యుల మధ్య వివక్షను సెక్షన్ 17 చూపడం లేదు . ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరారు .

చట్టం 30/1987 ద్వారా ట్రస్ట్ డీడ్ లను శాసనసభ రద్దు చేసిందని పిటిషన్ లో తెలిపారు . ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు ఆధారపడిన డీడ్ చెల్లదన్నారు . సెక్షన్ 17 ప్రకారం వ్యవస్థాపక కుటుంబ సభ్యుల విషయంలో పురుషులు , స్త్రీల మధ్య వివక్ష చూపడం లేదనే విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందన్నారు . దేవాదాయ చట్టం 1987 సెక్షన్ 16 వంశపారంపర్య ట్రస్టీల వ్యవస్థను రద్దుపరిచిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాల్సిందన్నారు . వ్యవస్థాపక కుటుంబ సభ్యుల గుర్తింపు వివాదాలను తేల్చేది ఏపీ దేవాదయా ట్రైబ్యునల్ అనే విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోవాల్సిందన్నారు . సెక్షన్ 87 ( హెచ్ ) ప్రకారం అశోక్ గజపతిరాజు ప్రత్యామ్నాయంగా ట్రైబ్యునల్ ను ఆశ్రయించాలన్నారు . ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరారు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎస్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది .

ఇదీ చదవండి:AndhraPradesh: హైకోర్టు పరిధిలో మూడు రాజధానుల అంశం: కేంద్ర హోంశాఖ

Last Updated : Jul 14, 2021, 5:27 AM IST

ABOUT THE AUTHOR

...view details