ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2020, 4:49 AM IST

ETV Bharat / state

మాన్సాస్‌ ట్రస్ట్‌ వివాదం.. మరింత ముదిరింది..!

మాన్సాస్‌ ట్రస్టు వివాదం మరింత ముదిరింది. ట్రస్టు పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలోని 9 గ్రూప్‌ ఆఫ్‌ టెంపుల్స్‌కి ఛైర్మన్‌గా ఉన్న అశోక్‌ గజపతిరాజును తప్పించి... సంచైతకు బాధ్యతలు అప్పగించగా మరోసారి చిచ్చు రాజుకుంది. దేవదాయశాఖ తీసుకొచ్చిన ఈ కొత్త జీవో... పరిస్థితిని తీవ్రస్థాయిలో వేడెక్కించింది.

Mansas‌ Trust controversy more advanced
మాన్సాస్‌ ట్రస్ట్‌ వివాదం.. మరింత ముదిరింది..!

మాన్సాస్‌ ట్రస్ట్‌ వివాదం.. మరింత ముదిరింది..!

మాన్సాస్‌ ట్రస్టు బాధ్యతల బదలాయింపుతో పూసపాటి వంశంలో చెలరేగిన వివాదం... ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోతో తారస్థాయికి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది గ్రూప్‌ ఆఫ్‌ టెంపుల్స్‌కి ఛైర్మన్‌గా ఉన్న అశోక్‌ గజపతిరాజును తప్పించి... ఆ బాధ్యతలు సంచైతా గజపతిరాజుకు అప్పగించడం వివాదానికి ఆజ్యం పోసింది. మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత, ఎంఆర్ కళాశాల వివాదం కొనసాగుతుండగానే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో... బాబాయ్‌-అమ్మాయి మధ్య దూరాన్ని మరింత పెంచింది.

తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది దేవాలయాలకు ఛైర్మన్‌గా తనను తప్పించడాన్ని.... అశోక్‌ గజపతిరాజు ఖండించారు. చట్టవిరుద్ధంగా, అర్ధరాత్రి జీవోలు ఇచ్చి... సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆక్షేపించారు. కుటుంబంలో ఎవరు ఉండాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించే స్థాయికి వచ్చిందని... ఇది చాలా ప్రమాదకరమని మండిపడ్డారు.

మాన్సాస్‌ ట్రస్టు ప్రస్తుత ఛైర్మన్‌ సంచైత... ట్విటర్ వేదికగా అశోక్ గజపతిరాజుపై ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా చేసిన అక్రమాలు బయటపడుతుండగా... అస్థిత్వం కోసం అశోక్‌ రాజకీయాలు చేస్తున్నారని ఆమె ట్వీట్‌ చేశారు. తక్కువ ధరకే వేల ఎకరాల ట్రస్టు భూములను అనుయాయులకు లీజుకు ఇచ్చారని ఆరోపించారు. సంచైత ట్వీట్లపై అశోక్‌ ఘాటుగా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అగత్యం తనకు లేదన్నారు. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న పూసపాటి వారి వివాదం... ఎక్కడ ముగుస్తుందన్నది తెలియడం లేదు.

ఇదీ చదవండీ... 'ఎవరు ఏ కుటుంబంలో ఉండాలన్నది ప్రభుత్వం చెబితే ఎలా?'

ABOUT THE AUTHOR

...view details