విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించిన వారిని పోలీసులు శిక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత నెల 23 నుంచి ఈ నెల 9వరకు అక్షరాలా కోటి 3 లక్షల 86 వేల రూపాయల జరిమానాలు విధించారు. ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే మరిన్ని కఠినమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
లాక్డౌన్ ఉల్లంఘిస్తే.. కేసులు తప్పవ్!
విజయనగరం జిల్లాలో లాక్డౌన్ను అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అత్యవసరమైతే గానీ ఎవరినీ రోడ్లపైకి అనుమతివ్వడం లేదు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అనవసరంగా రహదారుల పైకి వస్తున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాలో తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలు ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
lockdown strictly followed in vizianagaram