ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 27, 2021, 8:09 AM IST

ETV Bharat / state

విజయనగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యం..లాక్​డౌన్​ను తలపిస్తున్న పరిస్థితి

కొవిడ్ రెండో వేవ్ విజృంభిస్తోంది.. గతేడాది పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ తరుణంలో విజయనగరంలోని రోడ్లన్నీ లాక్​డౌన్ పరిస్థితులు గుర్తుకు తెస్తున్నాయి.

విజయనగరంలో నిర్మానుషంగా రోడ్లు
విజయనగరంలో నిర్మానుషంగా రోడ్లు

కొవిడ్ రెండో దశ వ్యాప్తి జోరందుకున్న నేపథ్యంలో గతేడాది కరోనా పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. ప్రజల్లో కలవరం మొదలైంది. విజయనగరం పట్టణంలోని ప్రధాన కూడలి రోడ్లన్నీ మళ్లీ లాక్​డౌన్ పరిస్థితులను తలపిస్తున్నాయి. వేరొక ప్రాంతంలో ఉద్యోగ రీత్యా పని చేసినవారు కరోనాకు గురికాకుండా ఉండేందుకు... తమ తమ ప్రాంతాలకు చేరుకునేందుకు ముందుగానే సిద్ధమవుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యం కావటంతో మూగజీవులన్నీ యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details