కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు విజయనగరంలో మంచి స్పందన వచ్చింది. ఉదయం నుంచి ప్రజలు కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వాహనాలు తిరగక రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. వాణిజ్య సముదాయాలు, రైతుబజార్లు, మార్కెట్ ప్రాంతాలు, రైల్వేస్టేషన్లు అన్నీ జనసందోహం లేక ఖాళీగా ఉన్నాయి.
విజయనగరంలో విజయవంతంగా జనతాకర్ఫ్యూ
విజయనగరంలో జనతాకర్ఫ్యూకు ప్రజలంతా మద్దతిచ్చారు. ఉదయం నుంచే విజయనగర వాసులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రహదారులన్నీ నిర్మానుషంగా ఉన్నాయి.
విజయనగరంలో జనతాకర్ఫ్యూ విజయవంతం