ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురం లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్సీకి గాయాలు - today Parvathipuram muncipal election counting latest update

పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా.. పార్వతీపురంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tension in Parvathipuram counting center
పార్వతీపురం లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత

By

Published : Mar 14, 2021, 12:04 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే అలజంగి జోగారావును లెక్కింపు కేంద్రం ఆవరణలోకి అనుమతించారంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం ఎమ్మెల్సీ జగదీశ్వరరావు.. అక్కడికి చేరుకున్నారు.

ఎమ్మెల్సీ జగదీశ్వరరావును పోలీసులు అడ్డుకునే క్రమంలో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. తనతో పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన స్వల్ప తోపులాటలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న డీఎస్పీ సుభాష్ ఎమ్మెల్యే జోగారావు, ఎమ్మెల్సీ జగదీశ్వరరావుకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details