జడ్పీటీసీ, ఎంపీటీసీ నామపత్రాలకు బుధవారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు పోటెత్తారు. పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడంతో నామపత్రాలు దాఖలు చేసేందుకు వరుస కట్టారు. నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా తరలివచ్చారు. మండల పరిషత్తు కార్యాలయాలు కోలాహలంగా మారాయి. జడ్పీ కార్యాలయంలో జడ్పీటీసీ నామపత్రాలను స్వీకరించారు. పత్రాల పరిశీలనకు కార్యాలయంలో ప్రత్యేకంగా మూడు విభాగాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 9 నుంచి నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. మూడు రోజులకు 34 జడ్పీటీసీ స్థానాలకు 241 దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే 206 మంది సమర్పించారు. ఎంపీటీసీ స్థానాల్లో పూసపాటిరేగలో అధికంగా 116 దాఖలయ్యాయి.
అభ్యర్థుల వెంట నేతలు..!