ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 27, 2021, 1:21 PM IST

Updated : Jul 27, 2021, 2:25 PM IST

ETV Bharat / state

Mansas Trust: చైర్మన్ ఆదేశాలు పాటించాల్సిందే: మాన్సాస్ ట్రస్టు ఈవోకు హైకోర్టు ఆదేశం

high-cour
high-cour

12:23 July 27

మాన్సాస్ ట్రస్టు ఈవో వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ

మాన్సాస్‌ ట్రస్టు ఈవో సహకరించడం లేదని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు వేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. ఈవో వ్యవహార శైలిపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఛైర్మన్‌ అశోక్‌ గజపతి రాజు ఇచ్చే ఆదేశాలు పాటించాల్సిందేనని ఆదేశించింది. ఆడిట్‌ అధికారితో మాత్రమే ఆడిట్‌ చేయించాలని.. ఇతరుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేసింది.

ట్రస్టు సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. ట్రస్టు అకౌంట్స్‌ సీజ్‌ చేయాలంటూ.. ఈవో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్‌ చేసింది. ట్రస్టు కింద ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్‌లో జోక్యం చేసుకోవద్దని ఈవోను ఆదేశించింది. పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేసింది. పాలక మండలి ఏర్పాటుకు జీవో 75పై కౌంటర్ వేయాలని తెలిపింది.

ఇదీ చూడండి:

viveka murder case: 51వ రోజు సీబీఐ విచారణ... మృతదేహాన్ని శుభ్రం చేసి కట్లు కట్టిన వైద్యులకు ప్రశ్నలు

Last Updated : Jul 27, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details