విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని దొరల తాడివలస గ్రామంలో వైకాపా నాయకులు పాస్టర్లకు నిత్యావసర సరకులు అందించారు. ఎమ్మెల్యే రాజన్నదొర పాస్టర్లకు నెల రోజులకు సరిపడా సరకులు పంపిణీ చేశారు. పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదును త్వరలోనే పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వీరి సమస్యను గుర్తించి కొందరు దాతలు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్నారు.
పాస్టర్లకు నిత్యావసరాల పంపిణీ
లాక్ డౌన్ కారణంగా చర్చీలు, దేవాలయాలన్ని మూతపడటంతో పాస్టర్లు, అర్చకులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిని పరిస్థితి వచ్చింది. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే రాజన్నదొర పాస్టర్లకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
grossaries provided by mla rajjana dora to pasters in viziangaram dst