ఆంధ్రప్రదేశ్

andhra pradesh

SIRIMANOTSAVAM: కన్నుల పండువగా పైడితల్లి సిరిమానోత్సవం

By

Published : Oct 19, 2021, 4:06 PM IST

Updated : Oct 19, 2021, 11:07 PM IST

ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవమైన విజయనగరం శ్రీపైడితల్లమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. నగరంలో సిరిమాను ఊరేగింపును భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు, పలువురు మంత్రులు అమ్మవారిని దర్శించుకున్నారు.

SIRIMANOTSAVAM
SIRIMANOTSAVAM

కన్నుల పండువగా పైడితల్లి సిరిమానోత్సవం

విజయనగరంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ పైడితల్లమ్మవారి సిరిమానోత్సవం కనులపండువగా జరిగింది. కొవిడ్ నిబంధనల నడుమ అధికారులు ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. చదురుగుడి నుంచి కోట వరకు మూడుసార్లు సిరిమానును ఊరేగించారు. పూజారి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. డీసీసీబీ వేదిక నుంచి ఉత్సవాన్ని మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స, అవంతి తిలకించగా.. కోట నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు వీక్షించారు.

సిరిమానోత్సవం ప్రారంభానికి ముందు అశోక్‌గజపతిరాజు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం.. అశోక్ పేదలకు ప్రసాదాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.

మంత్రి వెల్లంపల్లితో పాటు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. పైడితల్లి అమ్మవారి దయతో మూడు రాజధానులు అతి త్వరలో ఏర్పాటు కావాలని మొక్కుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. అమ్మవారి దర్శనంతో ముఖ్యమంత్రి కల నెరవేరుతుందని ఆశిస్తున్నానని అన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగునంగా సిరిమానోత్సవానికి ఏర్పాట్లు జరిగాయన్నారు. రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి తెలియచేశారు.

ఇదీ చదవండి:

Ashok Gajapathiraju: ప్రభుత్వానికి మంచి బుద్ధి కల్పించాలని ప్రార్థించా: అశోక్‌ గజపతిరాజు

Last Updated : Oct 19, 2021, 11:07 PM IST

ABOUT THE AUTHOR

...view details